గోవధ కేసులో నిందితుడికి కోర్టు షరతు
అలహాబాద్ (యూపీ), జూన్ 4: గోవధ కేసులో నిందితుడికి గో సేవ చేయాలన్న షరతుతో అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సలీం అలియాస్ కాలియా అనే వ్యక్తి గోవధకు పాల్పడినట్టు గతంలో కేసు నమోదైంది.
ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ అతడు పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం విచారణ జరిపింది. నెల రోజులపాటు గోశాలలో గో సేవ చేయాలని షరతు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. అలాగే గుర్తింపుపొందిన గోశాల పేరు మీద లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని సూచించింది.