Septic Tank | కోలార్, డిసెంబర్ 18: కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. కోలార్ జిల్లా యలువహళ్ళి లోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో దళిత విద్యార్థులతో స్కూలు అధికారులు బలవంతంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించారు. ఈ ఘటనపై పెద్దయెత్తున విమర్శలు రావడంతో సీఎం సిద్ధరామయ్య జోక్యం చేసుకొని సమగ్ర విచారణకు ఆదేశించారు. పాఠశాల ప్రిన్సిపల్ భారతమ్మ, టీచర్ మునియప్ప, హాస్టల్ వార్డెన్ మంజునాథ్, అతిథి టీచర్ అభిషేక్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. భారతమ్మ, మునియప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.