పతనంతిట్ట: కేరళలోని శబరిమల ఆలయంలో సౌకర్యాల లేమిపై వస్తున్న విమర్శలపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్పందించింది. చిన్నపిల్లలు సులభంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు ఆదివారం ప్రత్యేక గేటు వ్యవస్థ ఏర్పాటు చేసింది. క్యూలు, భక్తుల రద్దీతో సంబంధం లేకుండా పిల్లలు ముందు వరుసలో దర్శనం చేసుకునేందుకు వీలుగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు టీడీబీ తెలిపింది. పిల్లలు, మహిళలు, దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. త్వరలోనే ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది.