న్యూఢిల్లీ, మే 2: ఈ లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెల్చుకుంటామని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఎద్దేవా చేసింది. ‘ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెల్చుకుంటామనడం పెద్ద జోక్. ఆ పార్టీ 300 సీట్లు దాటడమే అసాధ్యం. 200 సీట్లు గెలవడం వారికి సవాల్’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో దిగువ సభలో కమలం పార్టీ తప్పక మెజారిటీని కోల్పోతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. గురువారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో బీజేపీకి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో వచ్చే సీట్లు సున్నా అని, దక్షిణాదిలో ఆ పార్టీ పరిస్థితి 2019 కన్నా అధ్వానంగా ఉందని అన్నారు. ఇక ఉత్తరాదిన సైతం గతంలోలా ఎన్డీఏ సీట్లు తెచ్చుకోవడం అసాధ్యమని అన్నారు.