న్యూఢిల్లీ: దేశంలో విమానయాన చార్జీలు పెంచడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం తీవ్రంగా విమర్శించారు. సాధారణంగా స్వేచ్ఛా విపణిలో డిమాండ్ పెరిగితే సరఫరా కూడా పెరుగుతుందని, కానీ భారత్ స్వేచ్ఛా విపణిలో మాత్రం డిమాండ్ పెరిగితే చార్జీలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు.
గతంలో ఢిల్లీ-చెన్నై బిజినెస్ క్లాస్ టికెట్లు విస్తారా, ఎయిర్ ఇండియాలలో రూ.6,300, రూ.5,700 ఉండేవని, ఇప్పుడు రూ.63,000, రూ. 57,000గా మారిందని వ్యంగ్యంగా అన్నారు. భారత్ నియంతృత్వ పెట్టుబడిదారీ విధానానికి విశ్వగురుగా మారబోతున్నదని వ్యాఖ్యానించారు.