న్యూఢిల్లీ: పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీకి భద్రతా సమస్య ఏర్పడిన అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఫిరోజ్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వెళ్లిన ప్రధాని మోదీ.. భటిండా విమానాశ్రయం నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఆయన కాన్వాయన్ను ఓ ఫ్లైఓవర్పై నిలిపేశారు. రైతులు రోడ్డుపై ఆందోళన చేయడంతో.. 20 నిమిషాల పాటు మోదీ వాహనాన్ని ఆపేశారు. ఈ ఘటనపై సీనియర్ అడ్వకేట్ మణిందర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తునకు ఆదేశించాలని సీజేఐ ఎన్వీ రమణను ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, పంజాబ్ ప్రభుత్వాలకు దీనిపై పిటిషన్ జారీ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు అడ్వకేట్ మణిందర్ సింగ్ను కోరింది. అత్యున్నత న్యాయస్థానం రేపు ఈ కేసులో విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
మరో వైపు ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లో ఆ కమిటీ నివేదిక ఇవ్వనున్నది. పంజాబ్ రిటైర్డ్ జస్టిస్ మెహతబ్ గిల్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాగ్ వర్మలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.