న్యూఢిల్లీ: అన్ని కోర్టుల్లో మంచి న్యాయమూర్తులు నియమితులు కావడం లేదని సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు. కొలీజియం వ్యవస్థ సరైన రీతిలో పని చేయడం లేదన్నారు. కొలీజియం తీర్మానాలను తప్పనిసరిగా అమలు చేయాలని, వీటిలో నచ్చినదానిని ఎంపిక చేసుకుని అమలు చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని తెలిపారు.
ఈ తీర్పును ప్రభుత్వం పదే పదే ఉల్లంఘిస్తున్నప్పటికీ, సుప్రీంకోర్టు ఏమీ చేయడం లేదన్నారు. తమ నిర్ణయాలు సాధ్యమైనంత త్వరగా అమలయ్యేలా చూసే ధైర్యం న్యాయమూర్తులకు లేదన్నారు. ప్రముఖ న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించడంలో కూడా కొలీజియం తీరును దవే తప్పుబట్టారు.