రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడిన సల్వా జుడుం మాజీ నేత చిన్న రామ్ గోటా కుమారుడు ప్రకాశ్ కుమార్ గోటా లోక్సభ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా దిగారు. తనకు బీజేపీ, కాంగ్రెస్లపై నమ్మకం లేదని, రాష్ట్రంలో మార్పు కోసం తాను కృషి చేస్తానని ప్రకాశ్ తెలిపారు.
ఆయన బస్తర్ లోక్సభ (ఎస్టీ రిజర్వుడు) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో 32 శాతం మంది ఎస్టీలు ఉన్నారని, వారికి ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు సరైన రీతిలో అందడం లేదని చెప్పారు. మిత్రుల ప్రోత్సాహంతో తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రచారం కోసం అవసరమైన వాహనాలు, ఆర్థిక వనరులను తన మిత్రులు సమకూర్చుతున్నారని చెప్పారు.