న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పాకిస్థాన్కు చెందిన లష్కరే తాయిబా ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రార్థనా మందిరాలు, చారిత్రక ప్రదేశాలపై ఉగ్ర దాడి చేసేందుకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. చాందినీ చౌక్లోని ఓ ఆలయాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నట్లు నిర్దిష్టమైన సమాచారం అందింది.
రెడ్ ఫోర్ట్ సమీపంలోని ప్రాంతాలు సహా సున్నితమైన ప్రదేశాల లోపల ఐఈడీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు వారు చెప్పారు. పాకిస్థాన్లోని ఒక మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా లష్కరే ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు.