భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో (Indore) దారుణం చోటుచేసుకున్నది. పెంపుడు కుక్కల కోసం జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఇండోర్కు చెందిన రాజ్పాల్ రజావత్ (Rajpal Singh Rajawat) అనే వ్యక్తి బ్యాంక్ ఆఫ్ బరోడాలో సెక్యూరిటీ గార్డుగా (Security guard) పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన పెంపుడు కుక్కతో వాకింగ్కు వెళ్లాడు. అదే సమయంలో రాజ్పాల్ ఇంటి పక్కనే ఉండే విమల్ ఆమ్చా (Vimal Amcha) కూడా తన పెట్ డాగ్ను (Pet dog) తీసుకుని వచ్చాడు. ఈ క్రమంలో రెండు శునకాలు ఘర్షణపడ్డాయి (Pet Dogs Fight).
అదికాస్త ఇద్దరు యజమానుల మధ్య గొడవకు దారి తీసింది. రాజ్పాల్, విమల్ ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. ఆవేశానికి లోనైన సెక్యూరిటీ గార్డ్ రాజ్పాల్.. తన ఇంట్లోకి వెళ్లి బాల్కనీ నుంచి విమల్ కుటుంబంపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయడప్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నిందితుడితోపాటు అతని కుమారుడు సుధీర్, బంధువు శుభ్మన్ను అదుపులోకి తీసుకున్నారు. గన్ లైసెన్స్ను రద్దుచేసి, అతనిపై హత్యకేసు నమోదుచేశారు. రెండు కుటుంబాల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని అదనపు డీసీపీ అమరేంద్ర సింగ్ వెల్లడించారు. పెంపుడు కుక్కల కోసం జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసిందని చెప్పారు. కాగా, ఇదంతా తతంగమంతా సమీపంలోని కెమెరాల్లో నమోదయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
कुत्ते को रखने और उसे घुमाने का विवाद अब बेहद हिंसक भी होने लगा है। इंदौर में बैंक के सिक्योरिटी गार्ड ने इसी विवाद में 8 लोगों को गोली मार दी। 2 व्यक्ति की मौत हो गयी है। 6 घायल है। pic.twitter.com/DglXAS7KsW
— Narendra Nath Mishra (@iamnarendranath) August 18, 2023