భువనేశ్వర్ : ఒడిశాలోని అంగుల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం వహించారు. ఓ రోగికి సెక్యూరిటీ గార్డు చేత ఇంజెక్షన్ ఇప్పించారు. ఈ ఘటన అంగుల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సెక్యూరిటీ గార్డ్ ఇంజెక్షన్ ఇస్తున్న దృశ్యాలను రోగి బంధువు చిత్రీకరించి ఆ వీడియోను వైరల్ చేశాడు.
ఈ ఘటనపై అసిస్టెంట్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ మానస్ రంజన్ బిశ్వాల్ స్పందించారు. సెక్యూరిటీ గార్డ్ ఇంజెక్షన్ ఇచ్చిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామన్నారు. ఆ సమయంలో ఎవరూ ఇంచార్జిగా ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.