ఢిల్లీ : రెండో దశలో కరోనా తుఫాన్ వలె విరుచుకుపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో సమావేశం పూర్తి అనంతరం దేశంలో కొవిడ్ పరిస్థితులపై జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఉధృతంగా ఉందన్నారు. వైద్య సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపిన మోదీ మనందరం కలిసి ఈ పరీక్షను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకూడదన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ఈ దిశగా పనిచేస్తుందని తెలిపారు.