న్యూఢిల్లీ : కేవలం 5 నిమిషాల్లోనే భూసార పరీక్షను పూర్తి చేసే పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భూసార పరీక్షలు పూర్తి అయ్యేసరికి దాదాపు రెండు వారాల సమయం పడుతున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు రాజుల్, ముకుల్సింగ్ మాట్లాడుతూ పేపర్ బేస్డ్ సెన్సర్ స్ట్రిపుతో పరీక్షలు చేసే పరికరాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.
‘దేశంలో 14 కోట్ల మంది రైతులు ఉన్నారు. భూసార పరీక్షలను నిర్వహించే ల్యాబ్లు మాత్రం 3,000 ఉన్నాయి. కాబట్టి రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ పరికరాన్ని తయారు చేశాం’ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.