న్యూఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఓ స్కూల్లో ప్రధాని మోదీకి పిల్లలు రాఖీ కట్టారు. చిరునవ్వులు చిందిస్తూ.. చిన్నారులు ఎంతో ప్రేమతో మోదీకి రాఖీ కట్టారు. రాఖీలు కట్టే సమయంలో ఆ విద్యార్థినుల పేర్లు, క్లాస్ ఏంటో ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఓ చిన్నారి సంతోషం ఆపుకోలేక ప్రధాని మోదీ చంపపై ముద్దు పెట్టింది. స్కూల్గర్ల్స్, టీచర్తో ప్రధాని గ్రూపు ఫోటో దిగారు. కొన్ని రాఖీలపై ప్రధాని మోదీ బొమ్మ కూడా ఉంది. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల్లో ఇవాళ రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. దేశ సరిహద్దుల్లో జవాన్లకు రాఖీలు కడుతున్నారు.
#WATCH | School girls tie Rakhi to Prime Minister Narendra Modi in Delhi, as they celebrate the festival of #RakshaBandhan with him. pic.twitter.com/Hhyjx63xgi
— ANI (@ANI) August 30, 2023
రక్షాబంధన్ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. అన్నాచెల్లెల మధ్య ఉన్న అమితమైన ప్రేమకు రాఖీ నిదర్శనంగా నిలుస్తుందని మోదీ అన్నారు. ఇవాళ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. రాఖీ పండుగ మన పవిత్ర సంస్కృతికి ప్రతిబింబిస్తుందన్నారు. ప్రజల మధ్య బంధాన్ని, సౌభాతృత్వాన్ని పెంపొందిస్తుందన్నారు.
मेरे सभी परिवारजनों को रक्षाबंधन की हार्दिक शुभकामनाएं। बहन और भाई के बीच अटूट विश्वास और अगाध प्रेम को समर्पित रक्षाबंधन का ये पावन पर्व, हमारी संस्कृति का पवित्र प्रतिबिंब है। मेरी कामना है, यह पर्व हर किसी के जीवन में स्नेह, सद्भाव और सौहार्द की भावना को और प्रगाढ़ करे।
— Narendra Modi (@narendramodi) August 30, 2023