Bus Falls Into Gorge | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సేలం (Salem)లోని ఏర్కాడ్లో ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడిపోయింది (Bus Falls Into Gorge). ఈ ఘటనలో సుమారు నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు 56 మంది ప్రయాణికులతో ఏర్కాడ్ (Yercaud) నుంచి సేలం వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు 13వ హెయిర్పిన్ బెండ్ వద్దకు రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా సైడ్ వాల్ను ఢీ కొట్టి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏర్కాడ్ పోలీసులు తెలిపారు.
Also Read..
Bomb Threat | ఢిల్లీ-ఎన్సీఆర్లో 60కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఉలిక్కిపడ్డ రాజధాని ప్రాంతం
AamirKhan | ఆ క్రెడిట్ అంతా అబ్బాజాన్దే.. అమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Divorced daughter | భర్తకు విడాకులిచ్చిన బిడ్డను మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి..!