న్యూఢిల్లీ : స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో 40 మంది చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఎదురైంది. పిల్లలను స్కూల్లో దించడం లేట్ అయిందనే ఆందోళనతో బస్ డ్రైవర్ ఏకంగా రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వేచిచూడకుండా ట్రాక్పై నుంచి వాహనంతో దూసుకెళ్లాడు. యూపీలోని గ్రేటర్ నోయిడా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్పై నుంచి స్కూల్ బస్ను పోనివ్వడం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
స్కూల్ బస్ డ్రైవర్ను ఆయారాంగా గుర్తించారు. పిల్లలను స్కూల్ వద్ద దింపడంలో ఆలస్యం కావడంతో రైల్వే ట్రాక్ను క్రాస్ చేసేందుకు ప్రయత్నించానని డ్రైవర్ పోలీసులకు వివరించాడు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. స్కూల్ బస్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.