న్యూఢిల్లీ : బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స కోసం వాడే యాంటీ ఫంగల్ డ్రగ్ యాంపోటెరిసిన్-బీ ఉత్పత్తిని ముమ్మరం చేసేందుకు చర్యలు చేపట్టామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఈ మందు ఉత్పత్తిని చేపట్టేందుకు అదనంగా మరో ఐదు ఫార్మా కంపెనీలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు తెలిపింది. కొవిడ్-19 రోగుల్లో ఇటీవల పలువురు బ్లాక్ ఫంగస్ వంటి కాంప్లికేషన్స్ తో ఇబ్బంది పడుతున్నట్టు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వెల్లడించాయని కేంద్రం పేర్కొంది.
బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే యాంటీ ఫంగల్ డ్రగ్ యాంపోటెరిసిన్-బీకి కొరత ఉందని రాష్ట్రాలు తమకు నివేదించాయని తెలిపింది. ఈ డ్రగ్ ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వం చొరవ చూపుతోందని తెలిపింది.విదేశీ కంపెనీల నుంచి ఈ డ్రగ్ ను దిగుమతి చేసుకునేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొంది.