లక్నో : పాలు కొనేందుకువెళ్లిన బాలిక (16) పై షాపు యజమాని లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన యూపీలోని ఫిలిబిత్ జిల్లాలో వెలుగుచూసింది. బాధిత బాలిక సోదరి ఫిర్యాదు ఆధారంగా డైరీ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గురువారం సాయంత్రం బాలిక పాలు కొనేందుకు నిందితుడు మోహన్ స్వరూప్ గంగ్వార్ దుకాణానికి వెళ్లగా ఆమెను బలవంతంగా లోపలికి తీసుకువెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు.
కాపాడాలని బాలిక కేకలు వేయగా ఆమెను విడిచిపెట్టిన షాపు యజమాని ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చేపట్టారు.