న్యూఢిల్లీ, మే 13: సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్)లో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మొత్తం ట్రిబ్యునల్నే నీరుగార్చారు’ అని కేంద్రాన్ని మందలించింది. ఖాళీలను భర్తీ చేయకపోతే ట్రిబ్యునల్ ఎలా పనిచేస్తుందని నిలదీసింది. ట్రిబ్యునల్లో ఉన్న మిగతావారు కూడా రిటైర్ అయితే పరిస్థితి ఏంటని మండిపడింది.
క్యాట్లో మొత్తం జడ్జిలు/పరిపాలనాధికారుల సంఖ్య 69. ఇందులో ప్రస్తుతం 29 మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రస్తుతం ట్రిబ్యునల్లో ఉన్నవారి పదవీకాలం ముగిసినా కూడా వారిని అలాగే కొనసాగించాలి’ అని కేంద్రానికి స్పష్టంచేసింది. తదుపరి విచారణ వరకు దీన్ని పాటించాలని తెలిపింది.