న్యూఢిల్లీ: షహీన్భాగ్లో బుల్డోజర్లతో జరుగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకోవాలని ఇవాళ సీపీఎం పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు కోర్టు రానివ్వాలని సుప్రీం సూచించింది. స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో.. ప్రస్తుతం అక్రమ నిర్మాణాల కూల్చివేతను నిలిపివేశారు.
ఏప్రిల్ 20వ తేదీన జహంగిర్పురిలో జరిగిన కూల్చివేత సమయంలో ఒక్క ఇంటిని కూడా ధ్వంసం చేయలేదని నార్త్ ఢిల్లీ మున్సిపాలిటీ ఇవాళ సుప్రీంకోర్టులో తెలిపింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన మరుసటి రోజే అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించినట్లు పిటిషనర్ చేసిన ఆరోపణలను మున్సిపాలిటీ ఖండించింది. ఆ పిటిషనర్లపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నది. ఈ కేసులో సీపీఎంతో పాటు జమాత్ ఉల్మా హింద్లు పిటిషన్ వేశారు.