న్యూఢిల్లీ : ఒడిషాలో పూరీ జగన్నాధ్ రధయాత్రతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రధయాత్రలు చేపట్టేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం తోసిపుచ్చింది. విపత్తు నిర్వహణ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో న్యాయస్ధానం జోక్యం చేసుకోబోదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
పూరి జగన్నాధ్ రధయాత్ర కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ రధయాత్రలకు అనుమతి ఇవ్వబోమని పిటిషన్లపై విచారం వ్యక్తం చేసింది. పూరీ జగన్నాధ్ రధయాత్రను ఏటా సంప్రదాయ రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించే యాత్రను జులై 12న జరుపుతారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పూరీ జగన్నాధ్ రధయాత్రను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.