SC Collegium | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రస్తుత న్యాయవాది మహబూబ్ సుభానీ షేక్ను నియమించాలన్న ప్రతిపాదనకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. ఇంకా ఢిల్లీలో పని చేసున్న ఏడుగురు న్యాయవాదులను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని చేసిన ప్రతిపాదనకు కొలీజియం ఆమోద ముద్ర వేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలో కొలీజియం ఈ నెల నాలుగో తేదీన సమావేశమైంది.
ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదులుగా పని చేస్తున్న వికాస్ మహాజన్, తుషార్రావు గెడెల, మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా, సచిన్ దత్తా, అమిత్ మహాజన్, గౌరాంగ్ ఖాంత్, సౌరబ్ బెనర్జీలను న్యాయమూర్తులుగా నియమించాలన్న ప్రతిపాదనను కొలీజీయం ఆమోదించింది. ఢిల్లీ హైకోర్టులో పూర్తి న్యాయమూర్తుల సంఖ్య 60 కాగా, 35 మంది మాత్రమే పని చేస్తున్నారు.
పాట్నా హైకోర్టులోనూ ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులను నియమించాలని చేసిన ప్రతిపాదనకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. వారిలో శైలేంద్ర సింగ్, అరుణ్ కుమార్ ఝా, జితేంద్ర కుమార్, అలోక్ కుమార్ పాండే, సునీల్ దత్తా మిశ్రా, చంద్ర ప్రకాశ్ సింగ్, చంద్రశేఖర్ ఝా ఉన్నారు.