Supreme Court | ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిపిన దుండగులకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సుప్రీం కోర్టు కొట్టివేసింది. నేటి నుంచి వారం రోజుల్లోగా నిందితులు జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. సాక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని నిందితుల బెయిల్ పిటిషన్పై తాజా నిర్ణయం తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం నాలుగువారాల గడువు ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సంబంధిత కార్యక్రమానికి హాజరై తిరిగి ఢిల్లీకి వస్తున్న సమయంలో ఫిబ్రవరి 3న ఒవైసీ వాహనం కాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. చార్జిషీట్ అనంతరం దాఖలు చేసిన అనంతరం అలహాబాద్ హైకోర్టు ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, నిందితుల విడుదలను ఒవైసీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.