న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారత విద్యార్థులకు సాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశీ వర్సిటీల్లో వారికి ప్రవేశాలను కల్పించేందుకు ఓ పోర్టల్ను ఏర్పాటుచేయాలని శుక్రవారం సూచించింది. భారత్లోని వర్సిటీల్లో తమకు ప్రవేశాలు కల్పించాలని ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. ఇందులోభాగంగా విద్యార్థులు విదేశాల్లోని యూనివర్సిటీల్లో చదువును పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది.
29 దేశాలకే ఎన్వోసీ
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద 29 దేశాల్లోని యూనివర్సిటీలకు మాత్రమే ఎన్వోసీ జారీ చేస్తామని ఎన్ఎంసీ చెప్పింది. ఆ దేశాల్లో అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బెల్జియం, ఈజిప్ట్, స్వీడన్, ఇజ్రాయెల్, ఇరాన్, స్పెయిన్, పోలండ్, టర్కీ, క్రొయేషియా, ఆస్ట్రియా, జార్జియా, కజకిస్థాన్, లిథువేనియా, స్లొవేకియా, ఉజ్బెకిస్థాన్, బెలారస్, లాత్వియా, కిర్గిస్థాన్, గ్రీస్, రుమేరియా, అజర్బైజాన్, బల్గేరియా, హంగేరి, చెక్ రిపబ్లిక్, మాల్డోవా ఉన్నాయి.