న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఎన్నికల కమిషన్కు (ఈసీ) అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఇచ్చేందుకు ఎస్బీఐ నిరాకరించింది. ఇది విశ్వసనీయ సమాచారం, వ్యక్తిగత వివరాలుగా పేర్కొన్నది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో వివరాలు అందుబాటులో ఉండగా, విశ్వసనీయ సమాచారం అంటూ కారణం చూపి ఆర్టీఐ దరఖాస్తును తిరస్కరించటాన్ని సామాజిక కార్యకర్త లోకేశ్ బాత్ర తప్పుబట్టారు. ఈసీకి అందించిన సమస్త వివరాలు డిజిటల్ ఫార్మాట్లో ఇవ్వాలని కోరుతూ లోకేశ్ బాత్ర ఆర్టీఐ కింద ఎస్బీఐకి దరఖాస్తు చేయగా, ఎస్బీఐ తిరస్కరించింది.