Satya Pal Malik | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీ (బీజేపీ) గెలిచే అవకాశాలు తక్కువని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి.’ అని మాలిక్ అన్నారు. పుల్వామా దాడిపై ప్రధాని స్పందించాలన్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని పదవికి బలమైన అభ్యర్థి అని అన్నారు. పుల్వామా ఉగ్ర దాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని ఆరోపించి, రక్షణ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ శక్తి సామర్థ్యాలపైన సందేహం వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.