న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ టెలికం రిలయన్స్ జియో శాటిలైట్ ఆధారిత ఫైబర్ సర్వీసెస్ను విజయవంతంగా అమలు చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సదుపాయం లేని గ్రామాలకు వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని అమలు చేసినట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. దీనిని జియో స్పేస్ ఫైబర్గా పిలుస్తున్నారు. భారత మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో శుక్రవారం దీనిని విజయవంతంగా ప్రదర్శించింది. దేశంలోనే అత్యధిక సబ్స్ర్కైబర్లను కలిగిన జియో ఇప్పటికే జియో ఫైబర్, జియో ఎయిర్ఫైబర్ వంటి బ్రాడ్బ్యాండ్ సర్వీసులను అందిస్తున్నది. ఇప్పుడు వీటికి అదనంగా జియో స్పేస్ ఫైబర్ను కూడా తీసుకొచ్చింది. ఈ సేవలతో దేశంలోని ప్రతి ప్రాంతానికీ ఇంటర్నెట్ సేవలు అందుతాయని రిలయన్స్ జియో తెలిపింది.