Loksabha Elections 2024 : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి దేశం గురించి ఏమీ తెలియదని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. కాంగ్రెస్కు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఆ పార్టీ నిత్యం అగౌరవపరుస్తుందని అన్నారు. దేశం పట్ల కాంగ్రెస్కు గౌరవం లేదని అందుకే ఆ పార్టీ ప్రజల నుంచీ దూరమైందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగం, దేశ ప్రజల పట్ల గౌరవభావంతో ఉంటారని అందుకే బీజేపీకి ప్రజల ఆదరణ లభిస్తోందని చెప్పుకొచ్చారు.
మరోవైపు రాహుల్ గాంధీ మిషన్ కాంగ్రెస్ 40 సీట్లను దాటడమేనని కేంద్ర మంత్రి, రాజస్ధాన్లోని బికనీర్ లోక్సభ అభ్యర్ధి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎద్దేవా చేశారు. విపక్షం చెప్పే మాటలను తాము ఖాతరు చేయబోమని అన్నారు. ఈసారి బీజేపీ 370 స్ధానాల్లో గెలుపొందుతుందని, ఎన్డీయే 400 స్ధానాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
తమ మిషన్ 400 సీట్లు దాటడమైతే, రాహుల్ మిషన్ 40 స్ధానాలకు మించి గెలుపొందడమని ఆయన పేర్కొన్నారు. బికనీర్లో తాను ఘనవిజయం సాధిస్తానని అంతకుముందు అర్జున్ రామ్ మేఘ్వాల్ ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్ధాయిలో బీజేపీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, భారీ ఆధిక్యంతో తాను విజయం సాధిస్తానని చెప్పారు. మేఘ్వాల్పై కాంగ్రెస్ పార్టీ నుంచి గోవింద్ రాం మేఘ్వాల్ తలపడుతున్నారు.
Read More :