కురుక్షేత్ర: కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 20న పార్లమెంటు ముందు ‘కిసాన్ మహాపంచాయత్’ నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నిర్ణయించింది. గురువారం కురుక్షేత్రలో ఎస్కేఎం సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను రైతు వ్యతిరేక బడ్జెట్గా నేతలు ప్రకటించారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, రైతులకు నెలకు రూ.5 వేల పింఛను, రుణమాఫీ వంటి డిమాండ్లతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. లఖింపుర్ ఖీరి ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.