కశ్మీరీ పండిట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ప్రతి సారీ పాక్ను దోషిగా చూపటం కంటే.. కేంద్రం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. జమ్మూ కశ్మీర్ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్ను ఉగ్రవాదులు హత్య చేసిన నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉన్న అస్థిరత నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా కశ్మీరీ పండితులకు రక్షణ లేకుండా పోయిందని రౌత్ ఆవేదన వ్యక్తం చేశారు. 370ని ఎత్తేసినా.. పండిట్లు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవడం లేదన్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా సురక్షితంగా లేరన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం గానీ, లౌడ్ స్పీకర్లను బంద్ చేయడం వల్ల కశ్మీర్ పండితుల సమస్యలు సమసిపోతాయా? అంటూ రౌత్ ప్రశ్నించారు.