ముంబై : హర్యానాలోని కర్నాల్లో రైతులపై లాఠీచార్జి ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్పై శివసేన విరుచుకుపడింది. మోదీ సర్కార్ది తాలిబన్ల మనస్తత్వమని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. రైతులపై పోలీసుల దాడి దేశానికి సిగ్గుచేటని పేర్కొన్నారు.
రైతుల గుండె చప్పుడు వినలేని మోదీ ప్రతినెలా మన్ కీ బాత్ అంటూ ప్రజల ముందుకు ఎలా వస్తారని ప్రశ్నించారు. బీజేపీ సమావేశాలకు నిరసనగా కర్నాల్ హైవేపై గుమికూడిన రైతులను చెదరగొట్టేందుకు శనివారం హర్యానా పోలీసులు జరిపిన కాల్పుల్లో పది మంది రైతులు గాయపడిన సంగతి తెలిసిందే. రైతులపై లాఠీచార్జి, పోలీసుల దమనకాండపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.