న్యూఢిల్లీ, జనవరి 25: దేశవ్యాప్తంగా 20 రాష్ర్టాల్లో పాదయాత్రలు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించడం ద్వారా వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటంలో అమరులైన రైతులకు నివాళులు అర్పిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) వెల్లడించింది.
గురువారం గణతంత్ర దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకొంటామని చెప్పింది. 20 రాష్ర్టాల్లోని 300 జిల్లాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లకు మెమొరాండం సమర్పిస్తామని తెలిపింది. ఇదే రోజు హర్యానాలోని జీంద్లో మహా పంచాయత్ నిర్వహించి తమ సంఘం ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న బీజేపీ కుట్రను ఎండగడతామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.