న్యూఢిల్లీ, జనవరి 17: మోదీ సర్కార్ విధానాలను నిరసిస్తూ కార్మిక, కర్షక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్ను ఏకకాలంలో చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు తాజాగా ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర అమలుజేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలని కార్మిక, కర్షక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.