Loksabha Elections 2024 | రానున్న లోక్సభ ఎన్నికల్లో బిహార్లో అన్ని స్ధానాల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి స్పష్టం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ జన్ విశ్వాస్ యాత్రపై స్పందిస్తూ ముందుగా తేజస్వి తనతో పాటు తన కుటుంబ సభ్యులు పాల్పడిన అవినీతి గురించి మాట్లాడాలని ఎద్దేవా చేశారు.
లోక్సభ ఎన్నికల్లో బిహార్లో అన్ని స్దానాల్లోనూ కాషాయ కూటమి విజయం సాధిస్తుందని బీజేపీ నేత సామ్రాట్ చౌధరి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి లోక్సభ ఎన్నికలకు సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
కాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రతిబింబించేలా బిహార్లో త్వరలో జన్ విశ్వాస యాత్ర చేపట్టనున్నారు. ముజఫర్పూర్లో ఈనెల 20న జరిగే తేజస్వి యాదవ్ ర్యాలీతో ప్రారంభం కానున్న జన్ విశ్వాస్ యాత్ర ఈనెల 29న ముగుస్తుంది.
Read More :
Hanuman | ఆంజనేయుడికి సిందూరంపై అంత ప్రీతి ఎందుకు?