న్యూఢిల్లీ: చీటింగ్ కేసులో సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు ఇవాళ సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. రెగ్యులర్ బెయిల్పై తుది నిర్ణయం వెలుబడే వరకు ఆజంఖాన్ తాత్కాలిక బెయిల్పై రిలీజ్ కానున్నారు. ఆర్టికల్ 142 ప్రకారం బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీం తెలిపింది. రాంపూర్ పబ్లిక్ స్కూల్తో లింకున్న భూ ఆక్రమణ, ఫోర్జరీ కేసులో ఆజంను అరెస్టు చేశారు. స్కూల్ గుర్తింపు కోసం బిల్డింగ్ సర్టిఫికేట్లను ఫోర్జరీ చేసినట్లు ఆజంపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 2020 నుంచి సీతాపూర్ జైలులో ఆయన శిక్షను అనుభవిస్తున్నారు. జస్టిస్ ఎల్ఎన్ రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది.