న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఓవర్సీస్ యూనిట్ అధినేత సామ్ పిట్రోడా(Sam Pitroda) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం చైనాతో ఉన్న వైరంపై ఆయన అనవసర వ్యాఖ్యలు చేశారు. చైనాను శత్రు దేశంగా చూడవద్దు అని పిట్రోడా తెలిపారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. చైనాతో వైరం పెట్టుకునే రీతిలో ఇండియా వ్యవహరిస్తునదని, ఆ మైండ్సెట్ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని పిట్రోడా తెలిపారు. అయితే చైనాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు.. పిట్రోడా వ్యాఖ్యలకు భిన్నంగా ఉండడంతో.. బీజేపీ ఆ పార్టీని తప్పుపట్టింది. భారత్ తన భూభాగాన్ని చైనాకు సమర్పించిందని రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది.
చైనా నుంచి ఎటువంటి సమస్య ఉందో అర్థం కావడం లేదని, అమెరికా ప్రమేయం వల్లే చైనాను శత్రువుగా చూస్తున్నారని పిట్రోడా తెలిపారు. అన్ని దేశాలు ఘర్షణలు మానుకొని, ఒక్కటి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. మన వ్యవహార శైలి ముందు నుంచీ వైరం పెట్టుకునే రీతిలో ఉందని, ఇలాంటి ప్రవర్తన వల్లే శత్రువులు తయారవుతారని, చైనా మన శత్రువు కాదన్న ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని పిట్రోడా చెప్పారు.