న్యూఢిల్లీ, మే 22: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా సలీల్ పరేఖ్ మరోసారి నియమితులయ్యారు. ఆయన మరో ఐదేండ్ల పాటు పదవిలో కొనసాగేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
పరేఖ్ 2018 జనవరి నుంచి ఇన్ఫోసిస్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐఐటీ బాంబే నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పరేఖ్కు ఐటీ రంగంలో దాదాపు 30 ఏండ్ల అనుభవం ఉంది.