Bipin Rawat: మొయిన్పురిలోని సైనిక్ స్కూల్కు దేశం కోసం అసమాన త్యాగం చేసిన సీడీఎస్ మాజీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరు పెడుతున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ గురువారం ప్రకటించారు. జాతికి సేవలందిస్తూ ప్రాణత్యాగం చేసిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ జ్ఞాపకార్ధం సైనిక్ స్కూల్కు జనరల్ బిపిన్ రావత్ సైనిక్ స్కూల్గా నామకరణం చేస్తామని యోగి ఆదిత్యానాధ్ కార్యాలయం ట్వీట్ చేసింది.
తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. హెలికాఫ్టర్ ప్రమాదంపై విచారణ చేపట్టిన కమిటీ రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్కు దర్యాప్తు నివేదిక సమర్పించిన అనంతరం యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రతికూల వాతావరణంతోనే హెలికాఫ్టర్ కుప్పకూలిందని విచారణ కమిటీ నివేదికలో పేర్కొంది. రావత్ ఆయన భార్య మధూలిక రావత్తో పాటు 13 మంది మరణించిన హెలికాఫ్టర్ కూలిన ఘటనలో కుట్ర కోణం, సాంకేతిక లోపాలను కమిటీ తోసిపుచ్చింది.