Jaggi Vasudev | ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev)కు గత వారం బ్రెయిన్ సర్జరీ (brain surgery) జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ తర్వాత వేగంగా కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిపై సద్గురు అప్డేట్ (Health Update) ఇచ్చారు. ఆసుపత్రి బెడ్పై తలకు బ్యాండేజ్తో ఎంతో కూల్గా న్యూస్ పేపర్ చదువుతున్న ఓ షార్ట్ వీడియో క్లిప్ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేశారు. వేగంగా కోలుకుంటున్నట్లు వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు సద్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
66 ఏండ్ల జగ్గీ వాసుదేవ్ గత నాలుగు వారాల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ నెల 8న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వైద్యుల బృందం ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించింది. ప్రస్తుతం సద్గురు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సద్గురు కుమార్తె రాధే జగ్గీ ఎప్పటికప్పుడు పంచుకుంటోంది.
#Sadhguru #SpeedyRecovery pic.twitter.com/rTiyhYPiJM
— Sadhguru (@SadhguruJV) March 25, 2024
Also Read..
Drugs | దేశంలో అతిపెద్ద డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించిన పంజాగుట్ట పోలీసులు
Vegans | మాంసాహారులతో పోలిస్తే వారిలో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువ..
AAP | ప్రధాని ఇంటి ముట్టడి.. ఢిల్లీలో భారీగా మోహరించిన పోలీసులు