హైదరాబాద్: దేశంలో అతిపెద్ద డ్రగ్స్ (Drugs) లింక్ను పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. పెద్ద ఎత్తున ఎక్స్టోసి పిల్స్ (Extosi Pills), ఎండీఎంఏ (MDMA), గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరబాగ్కు డ్రగ్స్ తెచ్చి కస్టమర్లకు విక్రయిస్తున్న సయూద్, ముంబాయికి చెందిన రోమి, పాలస్తీనాకు చెందిన సయీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4.75 గ్రాముల ఎక్స్టోసి పిల్స్, 5.18 గ్రాముల ఎండీఎంఏ, 109 గ్రాముల గంజాయి, రెండు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల లిస్ట్లో 14 మంది స్మగ్లర్లు, హైదరాబాద్కి చెందిన 31 మంది వినియోగదారులు ఉన్నారు. సయూద్ స్టూడెంట్ ప్రస్తుతం వీసాపై హైదరాబాద్లో ఉంటున్నాడు. అతని ఆర్డర్ మేరకు గోవాలోని క్రిస్ నుంచి కొనుగోలు చేసి రోమీ అందిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కేసునమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.