చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ నివాసం వద్ద శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) శనివారం భారీగా నిరసన తెలిపింది. ఆ పార్టీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు చండీగఢ్లోని సీఎం అధికార నివాసం వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినందున ఆ మేరకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ రైతుల పక్షాన పోరాడుతున్నది. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడంపై నిరసన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచింది. శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయగా, ఆ పార్టీ ఎన్డీయే కూటమిని వీడింది.