తిరువనంతపురం, ఏప్రిల్ 12: కేరళలోని ఎరాంజోలిలో ఓ ఆరెస్సెస్ కార్యకర్త అక్రమంగా బాంబులను తయారు చేశాడు. అయితే, ప్రమాదవశాత్తు అది పేలి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో అతడి చేయి ఛిద్రమైంది. ఎరాంజోలి వంతెనకు సమీపంలోని కచుంబ్రాత్ వద్ద విష్ణు (20) అనే ఆరెస్సెస్ కార్యకర్త పేలుడు పదార్థాలను, వివిధ పరికరాల్ని అసెంబ్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పేలుడు పదార్థాల తయారీలో అతడితోపాటు ఇంకా ఎంతమంది ఉన్నారన్నదానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.