Defence Budget | పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ శాఖను మరింత బలోపేతం చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. డిఫెన్స్కు కేటాయించే బడ్జెట్ను (Defence Budget) మరింత పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ‘ఆపరేష్ సిందూర్’ (Operation Sindoor) అనంతరం రక్షణ రంగానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పద్దు కంటే రూ.50,000 కోట్ల మేర బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేపట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పార్లమెంట్ శీతాకాల సమావేశంలో రూ.50వేల కోట్లకు సంబంధించిన సప్లిమెంటరీ పద్దును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది బడ్జెట్లో రక్షణశాఖ కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం వార్షిక పద్దులో 13 శాతం రక్షణ రంగానికే కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 9.53% ఎక్కువ. ఇప్పుడు అదనపు కేటాయింపులతో డిఫెన్స్కు కేటాయించిన నిధులు రూ.7 లక్షల కోట్లు దాటుతాయని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ బడ్జెట్లో సాంకేతిక పరిజ్ఞానం, మందుగుండు సామగ్రి కొనుగోలు, కొత్త ఆయుధాల ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ మేరకు ఆలోచన చేసినట్లు తెలిసింది.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 10 సంవత్సరాల్లో రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2014-15 బడ్జెట్లో రక్షణ రంగానికి రూ. 2.29 లక్షల కోట్లు కేటాయించారు. అది ఈ ఏడాదికి రూ.6.81 లక్షల కోట్లకు చేరింది. తాజా నిర్ణయంతో రూ.7 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. అయితే, తాజా పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ప్రభుత్వ వర్గాలను (government sources) ఊటంకిస్తూ ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే నివేదించింది.
Also Read..
Indian Army | ఇండియన్ ఆర్మీకి తన సేవింగ్స్ను విరాళంగా ఇచ్చిన ఎనిమిదేళ్ల చిన్నారి
Parliament | పార్లమెంట్ స్పెషల్ సెషన్కు విముఖత వ్యక్తం చేసిన కేంద్రం..!
Rajnath Singh | భుజ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ను సందర్శించిన రాజ్నాథ్ సింగ్