జైపూర్: రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అతని వద్ద ఆరు బంగారు బిస్కెట్లను గుర్తించారు. బంగారు బిస్కెట్లను ఎలక్ట్రిక్ మీట్ గ్రైండర్ ఉంచి అక్రమంగా తరలిస్తున్నాడని తెలిపారు. బంగారం విలువ రూ.28 లక్షలు ఉంటుందని తెలిపారు.
దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడు ట్రాలీబ్యాగ్ ఫ్రేమ్లో రూ.16.18 లక్షల విలువైన బంగారం అక్రమంగా తీసుకొస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకొన్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీచేశారు. అతడు తీసుకొచ్చిన ట్రాలీబ్యాగ్ ఫ్రేమ్లో బంగారానికి రేడియం పేస్టుచేసి దాచారు. కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం 330 గ్రాములు ఉందని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.