Deputy collector | భువనేశ్వర్: ఒడిశాలోని ఒక అధికారి విజిలెన్స్ అధికారుల దాడిని పసిగట్టి ఏకంగా రెండు కోట్ల నగదును పక్కింటి టెర్రస్ పైకి విసిరేయడానికి ప్రయత్నించాడు. నాబరంగ్పూర్ జిల్లా అడిషనల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ప్రశాంత్ రౌత్ ఇంటిపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడి చేశారు.
ఇది పసిగట్టిన ఆయన రూ.500 నోట్ల కట్టలతో ఉన్న రెండు కోట్ల నగదును పక్కింటి టెర్రస్పైకి విసరగా, ఆరు పెట్టెలలో దాచిన రెండు కోట్ల నగదును సీజ్ చేశారు.