Haryana | హర్యానాలో చెలరేగిన అల్లర్లకు ఆరుగురు బలైన సంగతి తెలిసిందే. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లర్లను నిరసిస్తూ భజ్రంగ్ దళ్, వీహెచ్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఢిల్లీ – ఫరీదాబాద్ రోడ్డుపై ఆందోళనకు దిగడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భజరంగ్ దళ్ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను పఠిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వికాస్ మార్గ్ను బ్లాక్ చేసేందుకు ఆందోళనకారులు యత్నించగా, పోలీసులు వారిని చెదరగొట్టారు. వికాస్ మార్గ్లో ప్రయాణించే వారిని ఐటీఓ మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఘజియాబాద్ నుంచి ఢిల్లీ వచ్చే వారికి ఎన్హెచ్-24 మార్గంలోని వెళ్లాలని సూచిస్తున్నారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో వీహెచ్పీ ప్రదర్శన సందర్భంగా చెలరేగిన మత ఘర్షణలకు సంబంధించి పోలీసులు 116 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై మంగళవారం ఏకంగా 41 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. హర్యానా అల్లర్లలో ఇమామ్ సహా ఇద్దరు హోంగార్డులు, ఇద్దరు పౌరులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
#WATCH | Bajrang Dal workers hold protest at Delhi’s Ghonda Chowk against Nuh violence; police barricades in place to control the crowd
Vishwa Hindu Parishad (VHP) has given a protest call against the recent violent clashes in Haryana’s Nuh pic.twitter.com/caHbLS5VEA
— ANI (@ANI) August 2, 2023