న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసు(Excise Policy Case)లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. రౌజ్ అవెన్యూ కోర్టు కస్టడీని పొడిగిస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీతో లింకున్న ఈడీ కేసులో కేజ్రీవాల్తో పాటు బీఆర్ఎస్ నేత కవిత, చన్ప్రీత్ సింగ్కు కస్టడీని పొడిగించారు. తీహార్ జైలులో ఉన్న నిందితుల్ని ఇవాళ వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. మే 7వ తేదీ వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. రిమాండ్ ముగియడంతో ఇవాళ సీబీఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు ఇద్దరు నిందితుల్ని వర్చువల్గా ప్రజెంట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులు విచారణ ఎదుర్కొన్నారు.