బెంగళూరు, జూన్ 6: కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బోలా గ్రామంలో నాథూరామ్ గాడ్సే పేరుతో ఓ వీధిలో సూచిక బోర్డు పెట్టారు. ఈ ఫొటోలు వైరల్ కావడం, విమర్శలు రావడంతో పోలీసులు, స్థానిక అధికారులు ఈ బోర్డును తొలగించారు. ఈ బోర్డు ఎవరు పెట్టారనేది తెలియలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజేంద్ర తెలిపారు. అయితే పోలీసులు దీనిపై ఆరా తీయగా బోర్డును రెండుమూడు రోజుల క్రితమే ఏర్పాటు చేశారని, సోమవారం అధికారుల దృష్టికి వచ్చిందని తెలిసింది.