Road accident: ఒక కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కారు అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అమాంతం పైకెగిరి ఎదురుగా వస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ఆక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాదాన్ని చూసిన స్థానికులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. రాజస్థాన్ రాష్ట్రం సికార్ జిల్లాలోని లక్ష్మణ్గఢ్ తాలూకాలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఒక కారులోని వ్యక్తులు మౌలాసర్ జిల్లాలోని నాగౌర్కు చెందినవారు కాగా, మరో కారులోని వ్యక్తులు సికార్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.