Road accident : కారు అదుపుతప్పి 500 అడుగుల లోతైన లోయలో పడటంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని నైనిటాల్ (Nainital) లో కైంచీ ధామ్ (Kainchi Dham) ఆలయానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు సానటోరియం-రాటిఘాట్ (Sanatorium-Ratighat) బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా అదుపుతప్పి 500 అడుగుల లోతు లోయలోపడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా.. మరొకరు వాహనం డ్రైవర్ ఉన్నారు.
కతిమా ఏరియాకు చెందిన భూపేంద్ర సింగ్ చుఫాల్ అనే 48 ఏళ్ల వ్యక్తి తన భార్య సీమా కైదా చుఫాల్ (45), కుమారులు వాసు చుఫాల్ (19), రవి చుఫాల్ (12) తో కలిసి నైనిటాల్ జిల్లాలోని కైంచి ధామ్ ఆలయానికి బయలుదేరారు. కైంచి ధామ్ సమీపానికి చేరుకున్న తర్వాత సానటోరియం-రాటిఘాట్ బైపాస్లో వెళ్తుండగా దైలా గ్రామం వద్ద కారు అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో భూపేంద్ర సింగ్ కుటుంబానికి చెందిన నలుగురితోపాటు లక్నోకు చెందిన డ్రైవర్ అనూజ్కుమార్ మిశ్రా కూడా మరణించాడు.